- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
వారికి ప్రధాని మోడీ భారీ శుభవార్త.. ఉచిత రేషన్పై కీలక ప్రకటన!
![వారికి ప్రధాని మోడీ భారీ శుభవార్త.. ఉచిత రేషన్పై కీలక ప్రకటన! వారికి ప్రధాని మోడీ భారీ శుభవార్త.. ఉచిత రేషన్పై కీలక ప్రకటన!](https://www.dishadaily.com/h-upload/2024/04/13/326264-modi-10.webp)
దిశ, వెబ్డెస్క్: 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా దేశ వ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు.70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామని వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. అంతేకాకుండా మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని తెలిపారు. ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ. 20 లక్షలు చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని మోడీ చెప్పుకొచ్చారు.