నవంబర్ 30న ఆ రెండు పార్టీలను తరిమేయండి: ప్రధాని మోడీ కీలక పిలుపు

by Satheesh |
నవంబర్ 30న ఆ రెండు పార్టీలను తరిమేయండి: ప్రధాని మోడీ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి ప్రజల చేతిలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించే బ్రహ్మస్త్రం ఉందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది.. ఓటమి భయంతోనే ఆ ఇద్దరూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, వారిని ఓడించి వారసత్వ, అవినీతి రాజకీయాలకు కామారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు, యూపీఏ కూటమిని ఇండియా కూటమిగా పేరు మార్చారు.. పేరు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి బుద్ధి మారదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని.. ఈ నెల 30వ తేదీన ఆ రెండు పార్టీలను తరిమివేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి తెలంగాణకు ముక్తి లభించాలి.. 9 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారు.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని.. ప్రజలు బీజేపీపై ఆశపెట్టుకున్నారనన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమన్నారు.

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం, బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది, వాగ్దానం ఇచ్చామంటే చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేయలేదు.. కానీ బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామన్నారు. ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని మోడీ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని ఓట్లు వేయించుకుంది.. తెలంగాణలో మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. బీజేపీ మాదిగల సాధికారతకు కృషి చేస్తుందని తెలిపారు.



Next Story

Most Viewed