- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మళ్లీ పొలిటికల్ హీట్.. అందరినీ ఎదుర్కొనేలా బీజేపీ స్కెచ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. మొన్నటివరకు మునుగోడు బైపోల్ సందర్భంగా హోరాహోరీగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న పార్టీలు మళ్లీ ఒకరిపై ఒకరు ఎదురుదాడికి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 12న రామగుండంలో ఎరువుల ప్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్న క్రమంలో టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు మాటలకు పదును పెట్టాయి. మోడీని అడ్డుకొని తీరుతామని హెచ్చరికలు చేస్తున్నారు.
వీటికి తోడు సింగరేణి జేఏసీ, రాష్ట్రంలోని ఆల్ యూనివర్సిటీ విద్యార్థి వేదిక సైతం మద్దతు పలికాయి. టీఆర్ఎస్వీ, వామపక్ష విద్యార్థి సంఘాలు సైతం కార్యచరణను ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్లీ రాజకీయం వేడెక్కినట్లయింది. బీజేపీ మాత్రం టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు తిప్పికొట్టేందుకు కార్యచరణను రూపొందిస్తున్నట్లు సమాచారం.
మోడీకి నైతిక హక్కు లేదు
మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సీపీఐ పిలుపునిచ్చింది. మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు తెలుపుతామని పేర్కొన్నది. తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు మోడీకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపడతామని, 12న వామపక్షాలు, టీఆర్ఎస్తో కలిసి అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
రామగుండంలో సింగరేణి కాలరీస్ను ప్రైవేట్పరం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారని సింగరేణి జేఏసీ మండిపడింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి ఎనిమిదేండ్లల్లో రోజుకో కోటు మార్చి వేశాలేసింది తప్ప ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిందేమీ లేదని తెలంగాణ ఆల్ యూనివర్శిటీ విద్యార్ధుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆ సంఘాల నాయకులు తెలిపారు.
టీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు
మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు మోడీ ఉత్త చేతులతోనే వస్తారా? ఏమైనా తెస్తారా?.. విభజన హామీల అమలు సంగతేమిటీ? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? తెలంగాణ సమాజం అడుగుతుందని టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. టీఆర్ఎస్ నిధుల గురించి ప్రశ్నిస్తుంది కానీ బహిరంగంగా మాత్రం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయలేదు. పోస్టర్లు, నల్ల బెలూన్లు, సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లాంటి వాటిపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎత్తులను చిత్తుచేసేలా బీజేపీ ప్లాన్
టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలను బీజేపీ అధిష్టానం గమనిస్తుంది. మోడీ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ మిత్రపక్షాలు ప్రకటించడం, గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిస్తుండటాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. టీఆర్ఎస్ వేసే ప్లాన్ ను చిత్తు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.