కొత్త సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిటిషన్

by Dishanational2 |
కొత్త సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సెక్రటేరియెట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్‌కు పాల్ విన్నవించారు. దీనిపై స్పందించిన సీజే పాల్ పిటిషన్‌‌కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్‌ను ఆదేశించారు. ఈ పిల్ రేపు విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 3న ఉన్న కొత్త సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.



Next Story