ప్రజల తీర్పును గౌరవించాల్సిందే : ఎంపీ రంజిత్ రెడ్డి

by samatah |
ప్రజల తీర్పును గౌరవించాల్సిందే : ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరుగుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్, దుబ్బాక‌లో ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పును గౌరవించామని, ప్రజలు ఓట్లు వేయలేదని అనలేదన్నారు. ప్రజలు ఏమనుకుంటే దాని ప్రకారం వారికే ఓట్లు వేస్తారన్నారు. ఎన్నికల సంఘానికి అందరం సహకరిద్దామన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకొని ఆపార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.

ఎన్నికల కమిషన్ ఎవరి చేతుల్లో ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఇచ్చిన తీర్పుతో బీజేపీ నాయ‌కుల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. మునుగోడు ప్రజ‌లు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. కేసీఆర్‌పై విశ్వాసంతో, ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప‌థ‌కాల‌కు ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ అడ్డదిడ్డంగా ప‌ని చేస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు మాట్లాడ‌టం స‌రికాదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గజ్జెల నగేష్, వెంకటేశ్వర్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed