- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గులాబీ బాస్కు మళ్లీ ఆహ్వానం అందలే.. విపక్షనేతలు కేసీఆర్ను నమ్మట్లేదా?
దిశ, డైనమిక్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు వేగం పెంచాయి. హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని కమలదళం ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఉమ్మడి కార్యాచరణకు రెడీ అయ్యాయి. 23న విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే.. 12నే జరగాల్సి ఉండగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్యనేతలు అందుబాటులో లేకపోవడంతో తేదీని పొడిగించారు. ఇప్పటికే ఆహ్వానాలు అందిన పలువురు విపక్ష నేతలు సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం పిలుపు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా జరగడం ఇది రెండోసారి.
గతేడాది ఆగస్టులో బిహార్ లో నితీష్ కుమార్ తో భేటీ నిర్వహించిన కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ కు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ ప్రయత్నాలకు తొలిమెట్టుగా భావిస్తున్న పాట్నా మీటింగ్ విషయంలో కేసీఆర్ ను విపక్ష పార్టీలు పరిగణలోకి తీసుకోకపోవడం చర్చకు దారి తీసింది. ఆహ్వానం అందకముదే మీటింగ్ కు దూరంగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. కానీ విపక్షాల పార్టీల తీరు మాత్రం మరోలా ఉందనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ పై విపక్ష కూటమిలోని మెజార్టీ పార్టీలకు నమ్మకం కుదరడం లేదు. అందువల్లే పాట్నా మీటింగ్ తేదీలు మారినా రెండుసార్లు ఆహ్వానం పంపలేదనే టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.