- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
శివలింగంపై అరుదైన శిలా శాసనం.. ఎక్కడ బయట పడిందంటే..?
![శివలింగంపై అరుదైన శిలా శాసనం.. ఎక్కడ బయట పడిందంటే..? శివలింగంపై అరుదైన శిలా శాసనం.. ఎక్కడ బయట పడిందంటే..?](https://www.dishadaily.com/h-upload/2024/03/13/316644-shiva-lingam.webp)
దిశ, అచ్చంపేట : చరిత్రలో ఎక్కడలేని అరుదైన శాసనం నల్లమల్ల అటవీ ప్రాంతంలో చరిత్రకారులు వెలుగులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో నిజాం కాలం నాటి శాసనం బయట పడినట్లు చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ తెలిపారు. అమ్రాబాద్ మండలం కొల్లంపెంట సమీపంలోని అడవిలో శివలింగంపై పార్శీ, తెలుగు భాషలో నిజాం శాసనం చెక్కబడి ఉందని చెప్పారు. చరిత్రలో ఇలాంటి శాసనం ఎక్కడా లేదన్నారు.
శాసన సారాంశం ఇదే...
హైదరాబాద్ రాజ్య నవాబు (8వ) నిజాముల్ ముల్క్ ఆసఫ్ హా, ముకరం ఉద్ దౌల్ బహదూర్ కొలువులోని జైన్ చంద్ర అనే సుంకం అధికారి ఆనాడు నల్లమల అడవి ప్రాంతంలోనీ 1932 ఏప్రిల్ 9 న ఇక్కడి బంజర్ భూమిలో మొక్కలు నాటించినట్లు శాసనంపై చెక్కబడి ఉంది. అదే శివలింగంపై తెలుగులో కూడా శాసన పంక్తులు కనిపిస్తాయి. ఈ శాసనంపై ఉన్న పార్శీ భాషను చరిత్ర బృందం అబ్బాస్ అలీ, అబ్దుల్ వాహెద్, అబ్దుల్ బాసిత్ లు అనువాదం చేశారు. ఈ శాసనం వెలుగులోకి రావడానికి కందుల వెంకటేశ్, దాసరి మల్లేశ్, సతీశ్, గాంధీ, గాజుల బసవరాజు, నరసింహులు సహకరించినట్లు ఆయన తెలిపారు.