- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరోసారి ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసహనం

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్భవన్ వర్సెస్ ప్రగతిభవన్ వార్ మరింత ముదురుతుంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల భర్తీని పర్యవేక్షించే 'కామన్ రిక్రూట్మెంట్ బోర్డు' ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరాజన్ లేఖ రాశారు. రాజ్భవన్కు వచ్చి ఈ బిల్లు గురించి తనతో చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తమిళిసై ఆదేశించారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెప్తు్న్నా.. గత 8 సంవత్సరాలుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలేదో చెప్పాలని గవర్నర్ ప్రశ్నించారు. రిక్రూట్మెంట్స్ చేస్తే ఎలా చేస్తారు? లోకల్ అభ్యర్థులకు ఎంతమేరకు ప్రాధాన్యత ఉంటుంది? కేటగిరీల విభజన ఎలా ఉంటుంది? అనే అంశాలపై రాష్ట్ర సర్కారును గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మధ్యలో ఎన్నికల కోడ్ వస్తే వర్సిటీల్లో నియామక ప్రక్రియలు నిలిచిపోయే అవకాశం ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. 'కామన్ రిక్రూట్మెంట్ బోర్డు' ఏర్పాటుకు సంబంధించిన అంశంపై గవర్నర్ తమిళిసై యూజీసీకి కూడా లేఖ రాశారు. యూనివర్సిటీల ఉద్యోగ ఖాళీలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం చెల్లుబాటు అవుతుందా? కాదా? అనే దానిపై యూజీసీ అభిప్రాయాన్ని కూడా గవర్నర్ కోరారు.