తెలంగాణకు వందే భారత్.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆ మార్గాల్లో..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-09 02:17:08.0  )
తెలంగాణకు వందే భారత్.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆ మార్గాల్లో..
X

దిశ, వెబ్‌డెస్క్: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును తెలంగాణకు కేంద్రం కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేకు ఈ మేరకు రైల్వే శాఖ సమాచారం అందించింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఏయే మార్గాల్లో నడపాలనే అంశంపై కసరత్తును అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి గరిష్టంగా పది గంటల్లోపే చేరే గమ్య స్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అత్యంత ఆధునిక రైలుగా రూపొందిన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో బెర్తులు లేవు. కూర్చొనే ప్రయాణించేలా ఈ రైలును రూపొందించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ పట్నం, బెంగళూరు, ముంబాయి వంటి మార్గాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.



Next Story

Most Viewed