అధికారుల నిర్వాకం.. తెలంగాణలో కొత్త జిల్లా?

by Disha Web |
అధికారుల నిర్వాకం.. తెలంగాణలో కొత్త జిల్లా?
X

దిశ, షాద్‌నగర్: మనకు తెలిసి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో శంషాబాద్‌ను జిల్లాగా చేసిందిలేదు. కానీ, ఆ ఆసుపత్రి అధికారులు మాత్రం శంషాబాద్‌ను జిల్లాగా చేసేశారు. ఏకంగా జిల్లా పేరిట సూచిక బోర్డునే ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేశంపేట మండలం షాద్‌నగర్ నియోజకవర్గం.. రంగారెడ్డి జిల్లాలో ఉంది. కానీ, కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులో మాత్రం శంషాబాద్ జిల్లా అని ఏర్పాటు చేయడం గమనార్హం. అటుగా వెళుతున్నవారు సూచిక బోర్డును చూసి అధికారులు జిల్లాపేరు కూడా మర్చిపోయినట్లున్నారని ముక్కున వేలేసుకుంటున్నారు.



Next Story

Most Viewed