ఎంపీగా గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తా

by Disha Web Desk 15 |
ఎంపీగా గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తా
X

దిశ, లింగంపేట్ : జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరింత అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం లింగంపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ఎంపీగా గెలుపొంది 10 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేపడతానని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేంద్రీయ విద్యాలయాలతో పాటు రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి

అభివృద్ధి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మూడోసారి దేశ ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ సాధిస్తారని అన్నారు. మోడీ సహకారంతో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. బీబీపాటిల్ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. సమావేశంలో మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ వడ్ల భీమయ్య, కమ్మరి వెంకటేశం, రామచందర్, దత్తురామ్ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed