కేసీఆర్‌ను నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ముంచేస్తాం.. వీఆర్ఏ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కేసీఆర్‌ను నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ముంచేస్తాం.. వీఆర్ఏ సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ వీఆర్ఏలను నిండా ముంచుతూ ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామానికి చెందిన సీనియర్ వీఆర్‌ఏ ముదం రాజయ్య నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీఆర్ఏల సమ్మె శుక్రవారం 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దొరల పాలన చేస్తూ కోట్లు వెనుకేసుకుంటున్నారన్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని.. లేని యెడల కేసీఆర్ ని నిజాంసాగర్ ప్రాజెక్టులో ముంచేస్తామన్నారు. సోనియా గాంధీ నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మించి నిండా ముంచే వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఇకపై కేసీఆర్ తన వైఖరి మార్చుకొని విఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేని యెడల రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అన్నారు.



Next Story

Most Viewed