'టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే'

by Disha Web Desk 20 |
టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గతంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను ఎన్నోసార్లు అవమానించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా ఎవరి ఊహలకు అందని విధంగా గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉందని, టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అమిత్ షా పాచిక నడిచిందని, అవమానపడిన గవర్నర్ బాధను దిగమింగుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ ప్రసంగించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టే కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీజేపీ, టీఆర్ఎస్ వేరు అనే విధంగా డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ప్రజాకవి కాళోజీ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిదని అన్నారని, కానీ తెలంగాణలో పుట్టుక మనది, చావు మనది, బ్రతుకంతా బీజేపీ, టీఆర్ఎస్ దని, కాళోజీ కన్న కలలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ గడీల పాలనలో బందీ అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. గవర్నర్ ప్రసంగిస్తూ తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పిందని తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి తప్పఎవరికి ఉద్యోగాలు రాలేవని, భూమి దోపిడికి గురవుతుందని, మూడు ఎకరాల భూమిరాలేదని ఆయన అన్నారు.

ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర లేదని, విద్య, వైద్యానికి నిధులు లేవని, సర్పంచులకు జీతాలు లేవని ఇటువంటి తెలంగాణను గవర్నర్ బంగారు తెలంగాణ అని ప్రసంగించడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపెట్టిందని, గిరిజనులకు 12% రిజర్వేషన్ లేదని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ లేదని, తెలంగాణకు 41,000 కోట్లు రావాల్సి ఉండగా 7700 కోట్లు గ్రాంటినైడ్ వచ్చిందన్నారు. యూనియన్ టాక్సెస్ లో కూడా ఆంధ్రప్రదేశ్లో 72 శాతం వస్తే తెలంగాణకు 67% మాత్రమే వచ్చిందని, తొమ్మిది ఏళ్లలో తెలంగాణ అప్పులు మాత్రమే సంపాదించిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed