- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > విషాదం: వినాయకున్ని తెస్తుండగా ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం
విషాదం: వినాయకున్ని తెస్తుండగా ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం
by Disha Web Desk 19 |
X
దిశ, కామారెడ్డి రూరల్: వినాయకుని తీసుకురావడానికి హైదరాబాద్ వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కామారెడ్డిలో విషాధచాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని బీడి కాలనీలోని ఓం యూత్ క్లబ్కు చెందిన 14 మంది యువకులు వినాయకుని తీసుకురావడానికి గురువారం హైదరాబాద్ వెళ్లారు. వినాయకుడిని తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో వీరి వాహనాన్ని మేడ్చల్ దగ్గర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భరత్, రాజు, లక్ష్మణ్ అనే ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కామారెడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story