మైనార్టీ గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి

by Disha Web Desk 15 |
మైనార్టీ గురుకుల విద్యార్థి  అనుమానాస్పద మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకుల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. నగరంలోని మాధవ్ నగర్ శివారులో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సోఫియాన్ (15) ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. సోఫియాన్ తోపాటు చదివే అతీఫ్ గొడవ పడినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అతీఫ్ సోఫియాన్ చాతిపై బలంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిసింది. ఆస్పత్రికి తరలించేసరికి మృతి చెందాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గురుకుల సంక్షేమ అధికారులు మాత్రం విద్యార్థులు గొడవపడిన విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సోఫియాన్ గుండెపోటుతో చనిపోయాడని చెబుతున్నారు.



Next Story

Most Viewed