- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సిద్దుల గుట్ట ఆలయ ఆదాయానికి గండి..?

దిశ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనీత సిద్ధులగుట్ట ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా మారింది.దేవుడు కరుణించిన పూజారి కరుణించ లేదన్నట్టు గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన నవనాథ సిద్దేశ్వరాలయం ఆలయ కమిటీ సభ్యుడి నిర్వాకంతో దేవస్థానానికి రావలసిన ఆదాయానికి గండి పడినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయం నవనాథ సిద్దుల గుట్టకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఆలయ కమిటీ తాత్కాలిక సభ్యులకు తెలిసిన నోరు మెదపడం లేదనే ఆర్మూర్ భక్తులతో పాటు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. నవనాథ సిద్ధులగుట్ట ఆలయం లో ఇంత జరుగుతున్న పూజ స్టోర్ విషయంలో ఎండోమెంట్ దేవాదాయ శాఖకు సైతం కనీస సమాచారం లేకుండా ఆలయ కమిటీ ఓ సభ్యుడు పూజ స్టోర్ ను నిర్వహించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఆలయంలోని పూజ స్టోర్ ను ఎలాంటి ఓపెన్ టెండర్ నిర్వహించకుండా తాత్కాలిక ఆలయ కమిటీ సభ్యుడు నిర్వహణ చేస్తూ నవనాథ సిద్దేశ్వర ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వరాలయం సిద్దుల గుట్టపై గతంలో గల ఆలయ కమిటీ పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర విక్రయించడానికి ఒక వ్యక్తిని నియమించి క్రయవిక్రయాలు నిర్వహించారు. ఈ విక్రయాల ద్వారా ప్రతి నెల సిద్దేశ్వరాలయ దేవస్థానానికి రూ. 50 వేల నుంచి 60 వేల ఆదాయం సమకూరేదని గత ఆలయ కమిటీలోని సభ్యులు బాహాటంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దుల గుట్టకు గత మహాశివరాత్రి సందర్భంగా తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
నవనాథ సిద్దుల గుట్టకు ఇటీవల ఏర్పాటుచేసిన ఆలయ కమిటీలోని సభ్యుడు ఒకరు సిద్ధులగుట్ట పై రూ. 2 లక్షలతో ఒక మడిగెను నిర్మించినట్లు కొత్తగా ఏర్పడిన తాత్కాలిక కమిటీకి చెబుతున్నట్లు తెలిసింది. రూ. రెండు లక్షలతో మడిగెను నిర్మించి నందున పూజ స్టోర్ ను నిర్వహించుకునేందుకు సభ్యులను ఒప్పించి.. ఆ కమిటీ సభ్యుడు పూజ స్టోర్ నిర్వహణ చేస్తున్నట్లు తెలిసింది. తాత్కాలిక కమిటీ ఆమోదంతో గత ఆరు నెలల నుంచి సిద్దుల గుట్టపై కమిటీ సభ్యుడు నవనాథ సిద్దేశ్వర పూజ స్టోర్ ను నిర్వహిస్తున్నారు. ఈ పూజ స్టోర్ లో గతంలో కంటే అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ దాదాపు లక్ష రూపాయలు ప్రతి నెల ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పూజ సామాగ్రిని విక్రయించే స్టోర్ ను ఆలయ కమిటీ ద్వారా నిర్వహిస్తే లక్ష రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చేది. ఇటీవల నియమించిన ప్రస్తుత నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యుల అనాలోచిత చర్య వలన సిద్ధులగుట్ట దేవస్థానం ఆదాయానికి భారీగా గండి పడుతుందని భక్తులతో పాటు ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.
ఓపెన్ టెండర్ లేకుండానే.. పూజ స్టోర్ నిర్వహణ..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దుల గుట్టపై ఏర్పాటు చేసిన పూజ సామాగ్రి విక్రయించే స్టోర్ ను ఓపెన్ టెండర్ నిర్వహించ కుండానే ఆలయ కమిటీలోని ఒక సభ్యునికి అప్పగించినట్లు తెలిసింది. వాస్తవానికి గుట్టపై పూజా సామాగ్రి విక్రయించే దుకాణాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే విస్తృత ప్రచారం నిర్వహించి ఓపెన్ టెండర్ నిర్వహిస్తే బాగుండేదని, ఆలయానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరేదని భక్తులు చెబుతున్నారు. ఎలాంటి టెండర్ నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా కమిటీ సభ్యుడు గది నిర్మించాడనే సాకుతో పూజ స్టోర్ ను అప్పగించడం సమంజసం కాదని భక్తులంటున్నారు. ఈ పూజా సామాగ్రి విక్రయించే స్టోర్ విషయమై దేవాదాయ శాఖ చొరవచూపి విచారణ చేసి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇదే నవనాథ సిద్దుల గుట్టపై ఎందరో భక్తులు లక్షలు వెచ్చించి ఎన్నో మందిరాలను నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత ఆలయ కమిటీ సభ్యుడు కేవలం రెండు లక్షల రూపాయలతో గదిని నిర్మించాను అన్న సాకుతో పూజ స్టోర్ ను అతనే వ్యాపారం చేసే అడ్డాగా మార్చుకోవడం, తద్వారా ఆలయ ఆదాయానికి గండి కొట్టడం భావ్యం కాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై ప్రేమతో ఏమైనా చేస్తే చేయాలి కానీ.. కేవలం గది నిర్మించి దాన్ని పూజ స్టోర్ ను ఆయన ఆధీనంలోకి తీసుకుని వ్యాపారం చేయడం ఏంటని ఆలయ కమిటీ సభ్యుడు తీరుపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.