కామారెడ్డిలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర

by Dishanational1 |
కామారెడ్డిలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర
X

దిశ, కామారెడ్డి రూరల్: శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని, బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ధర్మశాల, ఇందిరాచౌక్, ప్రభుత్వ ఆస్పత్రి, సుభాష్ రోడ్, పాంచ్ చౌరస్తా, పెద్దబజార్ మీదుగా రైల్వే కమాన్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి, విద్యానగర్ సాయిబాబా ఆలయం నుంచి కొట్టబస్టాండ్ వరకు ఈ శోభాయాత్ర సాగింది. శోభయాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రీరాముని విగ్రహం, హనుమాన్, శివాజీ, మహాశివుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక విద్యుత్ కాంతుల నడుమ డోలు భాజాలతో శోభాయాత్ర సాగింది. యువత పెద్ద ఎత్తున శోబాయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ జైశ్రీరామ్ అనే నినాదాలతో మారుమ్రోగించారు. మహా శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి గంజ్ గేట్ నుంచి రామారెడ్డి రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు ట్రాఫిక్ దారి మళ్లించారు.








Next Story

Most Viewed