- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
రైతుల చిరకాల కోరిక నెరవేరుతుంది : ఎమ్మెల్యే పోచారం
by Sumithra |

X
దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర ఎత్తిపోతల పథకం కోసం జాకోర గ్రామంలో నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ జాకోర ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తొమ్మిది గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది. జాకోర ఎత్తిపోతల పథకం కోసం జాకోర గ్రామంలో ఈరోజు నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమిపూజ చేసి అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతుల చిరకాల కోరిక నెరవేరుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Next Story