ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించాలి

by Disha Web Desk 15 |
ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించాలి
X

దిశ, ఆర్మూర్ టౌన్ : స్థానిక ఏడవ వార్డు తిరుమల కాలనీలో నరేంద్ర మోడీని బలపరుస్తూ ధర్మపురి అరవింద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ గెలిచిన ఐదేళ్లలో పసుపు బోర్డు తీసుకొస్తా అని

ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డ్ పూర్తిచేసిన అరవింద్ కి మరొక అవకాశమిస్తే ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఖాందేష్ ప్రశాంత్, 31వ బూత్ అధ్యక్షులు కుంటల గంగాధర్, మధుసూదన్ రెడ్డి, ఏనుగందుల రాజయ్య, సామ శేఖర్, నారాయణ గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed