అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు..

by Sumithra |
అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు..
X

దిశ, బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ నీరు 3 విడతలు విడిచిన తమ పొలాలకు ఇప్పటి వరకు నీరు అందలేదని రైతులు చెప్తున్నారు. నిజాంసాగర్ నీరు ఉపకాలువ ద్వారా చెరువు నింపితే తమ పంటలు ఎండకుండా ఉంటాయని రైతులు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చెరువు వరకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులు, నాయకులు స్పందించి చెరువు నింపి తమ పంటలను కాపాడాలని రైతులు మాడ మారుతి, జంగిలి శ్రీనివాస్ లు కోరుతున్నారు.

Advertisement
Next Story