గాంధారిలో కాంగ్రెస్ దీక్ష... పాల్గొన్న రేవంత్ రెడ్డి

by Dishanational1 |
గాంధారిలో కాంగ్రెస్ దీక్ష... పాల్గొన్న రేవంత్ రెడ్డి
X

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన జోడో యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు గుడిబెట్నుండి కాలినడకన వచ్చి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ సభాస్థలికి భారీగా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉదయం 9 గంటల నుండి గాంధారి మండలం మాధవ పల్లి గేట్ నుండి మొదలై, అక్కడి నుండి గాంధారి మండలంకు చేరుకుని మండలంలోని శివాజీ చౌక్ వద్ద "నిరుద్యోగ నిరసన దీక్ష" కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు రేవంత్ రెడ్డి అక్కడే దీక్షలో కూర్చోనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


Next Story

Most Viewed