జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన బ్రాహ్మణపల్లి క్రీడాకారిణి

by Disha Web Desk 6 |
జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన బ్రాహ్మణపల్లి క్రీడాకారిణి
X

దిశ, తాడ్వాయి : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 01 వరకు వెస్ట్ బెంగాల్ లో జరుగనున్న సాబ్ జూనియర్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ముస్కు రవీనారెడ్డి ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణా జట్టుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.దీంతో జాతీయస్థాయిలో ఆడుతున్న రవీనా రెడ్డిని గ్రామ సర్పంచ్ ఇంద్ర రాజయ్య, జడ్పీటీసీ రమాదేవి నారాయణ, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ అహ్మద్, స్టేట్ వాలీబాల్ అధ్యక్షుడు గజ్జల రమేష్ బాబు, సెక్రటరీ హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయుడు బాలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు.


Next Story

Most Viewed