'విద్యా, క్రీడా రంగాల్లో యువతను ప్రోత్సహించడమే నా లక్ష్యం..'

by Sumithra |
విద్యా, క్రీడా రంగాల్లో యువతను ప్రోత్సహించడమే నా లక్ష్యం..
X

దిశ, మర్రిగూడ : యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా దరి చేరుతుందని యువజన నాయకుడు, సామాజిక కార్యకర్త వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. మండలంలోని యరగండ్లపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహించిన వైపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. నిర్వాహకులు సంతోష్ యాదవ్ విజేతలకు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. ప్రథమ బహుమతి కింద శ్రీరామ్ టీమ్ కు రూ.25,000, సాయిశ్వర్ టీమ్ కు రూ.15,000, అభి టీమ్ కు రూ. 10,000 నగదుతో పాటు ట్రోఫీలను మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్ తో కలిసి ఆయన అందజేశారు. టోర్నమెంట్ లో పాల్గొన్న మిగతా టీమ్ లకు ప్రోత్సాహక బహుమతులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ మాట్లాడుతూ యువతను విద్య, క్రీడా రంగాల్లో ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యువతకు కావలసిన మెటీరియల్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయంగా, ఉద్యోగాల పరంగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకు గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులను శాలువాతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. సంతోష్ యాదవ్ తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ యువతను నిరుత్సాహపరచకుండా టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ పెద్దలు సంతోష్ యాదవ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కుక్కడపు యాదయ్య గౌడ్, డా.రమణ, నాయకులు, ఆర్గనైజర్ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed