జాతరకు ముస్తాబైన యాదాద్రి మేడారం చల్లూరు

by Naresh |
జాతరకు ముస్తాబైన యాదాద్రి మేడారం చల్లూరు
X

దిశ, రాజాపేట: రాజాపేట మండలం చల్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని యాదాద్రి మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర ఎల్లమ్మకు బోనాలతో సాంప్రదాయ బద్ధంగా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాద వాతావరణంలో ప్రకృతి రమణీయ, కమనీయ అందాల మధ్య ఈ వన దేవతలు కొలువు తీరాయి. సమీప 11 గ్రామాల ప్రజలు జాతర ఏర్పాట్లలో తమ వంతు భాగస్వామ్యం వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసి పరిసర గ్రామాల్లో ఇంటింటికి పోస్టర్లను అతికించి ప్రత్యేక వాహనాల ద్వారా మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. 21వ తేదీన సారలమ్మ గద్దె పైకి రావడం, 22వ తేదీన సమ్మక్క గడ్డపై ప్రవేశించడం, 23వ తేదీ మొక్కులు, 24వ తేదీ వనప్రవేశంతో జాతర ముగుస్తుందని నిర్వాహకులు చెప్పారు.

పొట్టి మర్రి, ఇబ్రహీంపురం చౌరస్తాల నుంచి భక్తులకు ఉచిత ఆటో వాహన సదుపాయాలను కల్పించినట్లు, ఉచిత మంచినీటి సరఫరా, ఉచిత విద్యుత్, వైద్యం ఏర్పాటు చేయనున్నట్లు చివరి రోజు ఉచిత ప్రసాద పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాపారస్తులకు కూడా ఉచితంగా స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొదటిసారిగా ప్రారంభమవుతున్న ఈ జాతరకు భక్తుల అధిక సంఖ్యలో హాజరు కావాలని వనదేవతల ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఇప్పటికే పలువురు భక్తులు జాతర ప్రాంగణంకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారని నిర్వాహకులు చెప్పారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

మండలంలో మూడు జాతరలు

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం లక్ష్మక్క పల్లి, చిన్న మేడారం మూడు జాతరలు జరగనున్నాయి. చల్లూరు, లక్ష్మక్క పెళ్లి గ్రామాలలో మొదటిసారి జాతర నిర్వహించ నుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.



Next Story

Most Viewed