- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంతా మా ఇష్టం.. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు

దిశ, మిర్యాలగూడ టౌన్ : నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేస్తారు.. చేసిందే పనిగా చేసుకుంటుపోవడం.. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభం చేయడం.. కోట్ల రూపాయాల పనులను మమ అన్పించి చేతులు దులుపుకోవడం ఇది మిర్యాలగూడ మండలం పరిధిలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పరిస్ధితి.
నాణ్యత నామమాత్రమే...
వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం సమీపంలో ఆర్ అండ్ బీ నుంచి మిర్యాలగూడ మండలం తక్కేళ పహడ్ పంచాయితీలోని జగ్గుతండాకు 2023 లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్టీ ఎస్డీ ఎఫ్ కింద బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.15 కోట్లు మాంజూరయ్యాయి. ఈ పనులను దక్కించుకున్న బీపీఎస్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థ ఇటీల నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3.15 కిలోమీటర్ల దూరానికి 3.75 మీటర్ల వెడల్పు మొదటి లేయర్ గా మట్టి, 12 ఇంచులుగా రెండు లేయర్ల మిక్స్డ్ కంకర, బీటీ వేయాలి. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించాల్సి ఉండగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. మట్టి లేయర్ పోయకుండానే చదును చేసి కంకర లేయర్లు వేసినట్లు స్దానిక రైతులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. చాలా ప్రదేశాలలో కాల్వలు ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొలాల తూముల ఏర్పాటు పై ఫిర్యాదు..
రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్కువ భాగం ఎల్ 15, 16 కాల్వల వెంబడి వేస్తున్నారు. అయితే ప్రధాన కాల్వ నుంచి పంట పొలాలకు నీరందించే పైపులను తొలగించి తక్కువ డయామీటర్ గల పైపులు వేస్తున్నారని, వాటిని తొలగించి 1 మీటర్ డయామీటర్ గల పైపులను ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.పీ డీఈ రంగా జనార్ధన్ ఎస్టీ ఎస్డీ ఎఫ్ ఈఈకి లేఖ రాశారు. రైతులకు నష్టం జరిగే విధంగా పైపులు వేయడం వలన రాబోయే రోజుల్లో పంటలకు నీరందే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులు వేసిన చోట సైడ్ వాల్ కూడా కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ప్రమాదాలు జరగనున్నట్లు రైతులు వాపోతున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే.. పోతురాజు నరేష్, ఏఈ, ఉమ్మడి నల్గొండ..
రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. పైపుల విషయంలో వేసిన వాటిని తొలగించి 1 మీటర్ పైపులు వేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించాం. రోడ్డు పనుల పై ఈ వారంలో పర్యవేక్షణ చేస్తాం.