నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

by Disha Web Desk 20 |
నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
X

దిశ, కనగల్లు : కనగల్లు మండలం జి.యడవల్లిలో పది రోజులుగా నీళ్లు రావడంలేదని సోమవారం మహిళలు ధర్నా చేపట్టారు. మూడు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు అంతంత మాత్రమే వచ్చాయని గత పది రోజులుగా నీళ్లు అసలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని సంబంధిత ప్రజాప్రతినిధిని అడిగితే పట్టించుకోవడంలేదని తెలిపారు.

Next Story

Most Viewed