కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత : మిర్యాలగూడ ఎమ్మెల్యే

by Aamani |
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత : మిర్యాలగూడ ఎమ్మెల్యే
X

దిశ, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించిన వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం మిర్యాలగూడ పట్టణం బయల్దేరుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు మహిళా సంఘాలకు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను అప్పగించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు ఈ ప్రభుత్వంలో ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేసి వారికి అండదండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు సభ్యులు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.



Next Story