భర్త వేధింపులకు భార్య బలి

by Disha Web Desk 15 |
భర్త వేధింపులకు భార్య బలి
X

దిశ భూదాన్ పోచంపల్లి : కట్నం తేవాలని భర్త వేధింపులు తాళలేక వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని అంతమ్మ గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోచంపల్లి ఎస్సై సైది రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వల్లూరి మల్లయ్య కూతురు శ్రీలత (30)కు సంజయ్ నగర్ నల్లకుంట హైదరాబాద్ వాసి గడ్డం సాగర్ తో 9 సంవత్సరాల క్రితం వివహమైంది. నాటి నుంచి రోజూ మద్యం సేవించి భార్య తో అదనపు కట్నం కోసం గొడవకు దిగేవాడు. ఇదే విషయంపై పెద్దల సమక్షంలో అనేక సార్లు ఆమె భర్తను మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. పైగా మృతురాలు అత్త, ఆడపడుచు, తోటి కోడలు, మరిది ఇలా కుటుంబం మొత్తం అదనపు కట్నం కోసం వేధిస్తూ 6 నెలల క్రితం ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు. అంతటితో ఆగని ఆమె భర్త ప్రతి రోజూ ఫోన్ చేసి మానసికంగా వేధిస్తూ ఉండేవాడు. దాంతో జీవితంపై విరక్తి కలిగి సూసైడ్ నోట్ రాసి మంగళ వారం తెల్లవారు జామున దూలానికి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలుకు కొడుకు హర్షవర్ధన (7), కూతురు నందిత(5) ఉన్నారు. ప్రస్తుతం వీరు తండ్రి వద్దే ఉన్నారు. శ్రీలత చావుకు కారణ మైన భర్త, కుటుంబ సభ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలు అన్న వల్లూరి శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి ఎస్సై సైది రెడ్డి పంచ నామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story