- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సభలో మాట్లాడని సన్నాసికి సభ ఎందుకు : శివసేన

దిశ, యాదాద్రి కలెక్టరేట్: తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష హోదాలో మాట్లాడని సన్నాసి శాసనసభ్యులుగా పనికిరారని శాసనసభలో ప్రజల కోసం మాట్లాడని సన్నాసికి బహిరంగ సభలు ఎందుకని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శివసేన పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో నల్గొండలో జరిగే బీఆర్ఎస్ సభకు ఎవ్వరూ వెళ్ళవద్దని ప్రజలను చేతులు జోడించి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా తెలంగాణ ద్రోహులకు ప్రాధాన్యం ఇచ్చారని నేడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్కు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాలలో ప్రాతినిధ్యం కల్పించని కేసీఆర్ నేడు కృష్ణ నీళ్లు పేరు మీద నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నందున నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని ఉద్యమము రుచి చూపించి కేసీఆర్ను రాకుండా అడ్డుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన నాయకులు జ్ఞానేశ్వర్, నమిలే శేఖర్, వాసగోని స్వామి గౌడ్, వాసగోని సత్యనారాయణ, నువ్వుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.