- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీ వెళ్తుండగా..ఘోర రోడ్డు ప్రమాదం..

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన డీసీఎం ట్రక్ డ్రైవర్ ఓనర్ అధ్వేష్ కుమార్ (38), క్లీనర్ రాజీవ్ (36)లు తమిళనాడు నుంచి, ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం ఉదయం అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ ఫ్లైవర్ దిగే క్రమంలో, కెమికల్ పౌడర్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న, ట్రక్ ఒక్కసారిగా ముందున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన డీసీఎం ట్రక్ క్యాబిన్ నుజ్జై డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. హుటా హుటినా ఘటనాస్థలికి సీఐ రాఘవరావు, ఎస్ఐ నాగరాజు సిబ్బందితో కలిసి వెళ్లి, మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించారు. అయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బాధిత కుటుంబీకులకు సమచారం అందించి, మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో బద్రపరిచినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.