యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక..ఎప్పుడంటే..?

by Naveena |
యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక..ఎప్పుడంటే..?
X

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఈ నెల 23న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై దేవదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

గురువారం యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర యాదగిరిగుట్ట కొండపైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కొండపైకి చేరుకున్న తరువాత ఎక్కడెక్కడ పర్యటిస్తారనే వివరాలను స్థానిక దేవస్థాన అధికారులతో కలిసి చర్చించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ, రెవెన్యూ, దేవస్థాన అధికారులతో కలిసి పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. మహోత్సవానికి వచ్చే భక్తులకు, దాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పార్కింగ్ తదితర అంశాలపై పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట యాదాద్రి ఏసీపీ రమేష్ కుమార్, యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్ఐ ఉదయ్ కిరణ్, దేవస్థాన అధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed