- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ ఐదుగురు సీక్రెట్ గా చేస్తున్న పని బట్టబయలు

దిశ, పెన్ పహాడ్ : గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. అనంతరం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి 5వేల నగదు, ఐదు సెల్ ఫోన్స్ ,ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఎస్సై కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని ఆవుల చెరువు వద్ద పేటక ఆడుతున్న నలుగురిని, సింగారెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట అడుతున్నారని తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు..ఎస్ ఐ గోపి కృష్ణ తన సిబ్బందితో కలిసి సాయంత్రం దాడులు నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న 5 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు ఐదు మోటార్ బైక్ లు,ఐదు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులైన ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా జూదాలకు పాల్పడితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.