- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం… స్వార్థ ప్రయోజనాలను ఉపేక్షించం

దిశ, మిర్యాలగూడ టౌన్ , దామరచర్ల: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లాలొని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మితమైతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్ధిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్లో జరుగుతున్న యునిట్ల నిర్మాణాలను, ఇతర పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రపంచ దేశాలన్ని గ్రీన్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంటే తెలంగాణలో గత ప్రభుత్వం థర్మల్ నిర్మాణం ఎందుకు చేపట్టిందో అర్థం కావడం లేదన్నారు. నిర్మాణంలో జాప్యం వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడిందన్నారు. అయినప్పటికి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అధికారులు శరవేగంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. భూములు కోల్పోయిన రైతులందరికి నష్ట పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు.
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ఇవ్వాలని అధికారులను కోరారు. రైల్వే , రోడ్డు పనుల పై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై హైదరాబాద్లో సమీక్ష జరిపినప్పటికి క్షేత్ర స్ధాయిలో పనుల పురోగతిని తెలుసుకునేందుకు సందర్శించి నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అలసత్వంపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్డీవో చెన్నయ్య, జెన్ కో సి.ఇ సమ్మయ్య ,డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు పొదిల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.