- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
MLC Theenmar Mallanna : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

దిశ, బొమ్మలరామారం : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం లక్ష రూపాయల రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని అన్నారు.
అందులో భాగంగా నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ రైతుల అకౌంట్లో డబ్బు జమ చేశారని పేర్కొన్నారు. రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని అన్నారు. రైతులందరూ గ్రామ గ్రామాన సంబరాలు జరుపుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ గూదె బాల నరసింహ, సింగిల్ విండో డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్, అద్దమడుగు రాజేష్ పైలట్, ప్రేమ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచులు ,ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.