రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Aamani |
రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ,వలిగొండ: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పౌరునికి కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు చివరి లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా దారులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా మండలంలోని నాతాలగూడెం గ్రామంలో పాల్గొని లబ్ధిదారులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ కి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమం కోసం, నిరుపేదల కోసం, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరిచేందుకు నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పని చేస్తుందని అన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని, ఈ పథకం ద్వారా భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీకి చెందుతుందని, ఆ కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు అందిస్తుందని, రైతు భరోసా మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని, రాళ్లకు, గుట్టలకు వర్తించదని స్పష్టం చేశారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వచ్చి అందిస్తున్నామని, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ చిన్న గ్రామానికి వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటేనే ఇది ప్రజా ప్రభుత్వమని అర్థమవుతుందని అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ చెప్పే మాటలు నమ్మొద్దని పనిచేసే వారి మాటలే నమ్మాలని మేము ఏ పార్టీ నాయకులకు భయపడమని కేవలం మీకు భయపడి పని చేస్తామని అన్నారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర మంత్రులతో కలిసి నిధులు మంజూరు చేయించి అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తానని అన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ... జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని, ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరగదని, నిజమైన లబ్ధిదారునికి లబ్ధి చేకూరకుంటే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకం అందుతుందని ఎవరు నిరాశ చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రేఖ బాబురావు,డీఆర్డీఓపీడీ నాగిరెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో కృష్ణ ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ ఉలిపే మల్లేశం, గరిసె రవి, బెలిదే నాగేశ్వర్,బత్తిని సహదేవ్, సామ రామ్ రెడ్డి,ఉద్దగిరి,భాస్కర్, తాసిల్దార్ పి.శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో జితేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు చౌటుప్పల్ ఏసీపీ పట్లోళ్ల మధుసూదన్ రెడ్డి రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story