Patel Ramesh Reddy: యాదాద్రిలో టూరిజం డెవలప్ చేస్తాం

by Kalyani |
Patel Ramesh Reddy: యాదాద్రిలో టూరిజం డెవలప్ చేస్తాం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్టలో టూరిజాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్టలో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్టలో ఉన్న హరిత హోటల్ లో మొత్తం 30 రూములు ఉండగా అందులో ప్రస్తుతం 15 రూములను వాడుతున్నట్లు మిగతా 15 రూములను సైతం వాడుకలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా దీనిపై చర్చించామని, మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో టూరిజానికి సంబంధించిన మరో నాలుగు ఎకరాల స్థలం ఉందని, దానిని కూడా భక్తులకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టతో పాటు కొలనుపాకను సైతం అభివృద్ధి చేస్తామని, దీని అభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తామన్నారు.



Next Story

Most Viewed