MLA Vemula Veeresham : రైతులకు మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం

by Kalyani |
MLA Vemula Veeresham : రైతులకు మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం
X

దిశ, చిట్యాల: రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర రైతన్నలకు మరపురాని కార్యక్రమం అని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రాంత రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు రుణమాఫీ సందర్భంగా గురువారం మండల పరిధిలోని ఊరుమడ్ల గ్రామంలో రైతు వేదిక వద్ద రైతులతో కలిసి సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతు వేదిక వరకు రైతులతో భారీ ర్యాలీ, స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ రైతు వేదిక వద్ద వరకు వచ్చారు. ప్రజా భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న లైవ్ కార్యక్రమాన్ని రైతులతో ఎమ్మెల్యే వీరేశం వీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ…రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తున్నదని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25 వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీ అమలు చేయడంలో వైఫల్యం చెందిన గత పాల కులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీ పై అవాక్కులు చెవాకులు పేల్చడం,అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి ,జడల చిన్నమల్లయ్య, జనగామ రవీందర్ గౌడ్, పల్లపు బుద్ధుడు, ఎద్దుల పూరి కృష్ణ, ఎరుపుల పరమేశం, కోసనం అశోక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed