కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీవితాంతం రుణపడి ఉంటాం

by Naveena |
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీవితాంతం రుణపడి ఉంటాం
X

దిశ, నార్కట్ పల్లి :కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజలకు బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రంతో నీటిని అందిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేశారన్నారు. నల్లగొండ పర్యటనలో భాగంగా నార్కట్ పల్లిలో రైతుల పక్షాన ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్ మాట్లాడుతూ..రైతు బిడ్డగా జన్మించిన వెంకటరెడ్డి రైతుల కలను నిజం చేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయన జన్మించడం తమ అందరి అదృష్టం అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందడంతో..ఈ ప్రాంతం కరువు తీరుతుందన్నారు. జీవితాంతం ఆయన రుణం తీర్చుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జిల్లా నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, ఇల్లందుల లింగస్వామి, చిక్కుల శివ, దామర ఉదయ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed