- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ,కోదాడ : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిటిజన్ అమెండమెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ సర్టిఫికెట్,(సీఏఏ, ఎన్ ఆర్ సి) రద్దు చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జబ్బార్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని నేడు దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీతోనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అన్ని వర్గాలకు దేశంలో రక్షణ ఉంటుందన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు.రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కోదాడలో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కోదాడలో ముస్లింల షాది ఖానాకు మూడు కోట్లు ,ఈద్గా అభివృద్ధికి రెండు కోట్లు మంజూరు చేశానన్నారు. మండు వేసవిలో ముస్లిం సోదరులు చేస్తున్న ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జబ్బర్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, టిపిసిసి డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, మాజీ మార్కెట్ చైర్మన్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, మైనార్టీ నియోజకవర్గ నాయకులు బషీర్ బుర్ర పుల్లారెడ్డి , అల్తాఫ్ హుస్సేన్ ,బాజాన్, బాగ్దాద్,ఎజాజ్, చింతలపాటి శ్రీనివాసరావు, పార సీతయ్య, పాలూరి సత్యనారాయణ, భాషూమియ, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఈవో మునావర్ అలీ భాయ్ తదితరులు పాల్గొన్నారు.