- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వావిు కళ్యాణం

దిశ,వలిగొండ: పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోని సుంకిశాల గ్రామంలో ప్రవాస భారతీయుడు పైళ్ళ మల్లారెడ్డి సాధన నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా..గురువారం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. స్వామి కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ నిర్మాణదాత పైళ్ల మల్లారెడ్డి సాధన దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. సుంకిశాల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వలిగొండ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. వలిగొండ నుంచి సుంకిశాల మీదుగా కాటేపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు నిధులు మంజూరు అయ్యాయని,త్వరలోనే టెండర్లు ప్రకటించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వైద్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ పైళ్ల సంధ్యారాణి ఆనంద్ రెడ్డి,మత్యగిరి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమా నాయక్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ వాకిటి అనంతరెడ్డి, గరిసె రవి,బాతరాజు బాల నరసింహ,బద్దం సంజీవరెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, ఈతప రాములు,చెరుకు శివయ్య,మొగిలిపాక నరసింహ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.