ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

by Naveena |
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ ,చివ్వేంల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. చివ్వేంల, ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అన్నారు .పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఓట్లు పోల్ అయినా..సాయంత్రం 4 గంటలు వరకు పోలింగ్ ముగించకూడదని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ ఐ శ్రీను, శ్రావణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story