- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
by Naveena |

X
దిశ ,చివ్వేంల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. చివ్వేంల, ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అన్నారు .పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఓట్లు పోల్ అయినా..సాయంత్రం 4 గంటలు వరకు పోలింగ్ ముగించకూడదని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ ఐ శ్రీను, శ్రావణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story