నిరుద్యోగ యువత ఉద్యోగాల పేరున మోసపోవద్దు

by Naresh |
నిరుద్యోగ యువత ఉద్యోగాల పేరున మోసపోవద్దు
X

దిశ, సూర్యాపేట: నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మోసపూరితమైన మాటలను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం అనే శీర్షికతో(దిశతో పాటు)వివిధ తెలుగు దిన పత్రికల్లో వచ్చిన వార్తలకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు స్పందించారు. కలెక్టరేట్‌లో శానిటేషన్ (స్యావెంజర్) నిమిత్తం కమిటీ ద్వారా ముగ్గురు స్యావెంజర్లను టెండర్ నిర్వహించి మణికంఠ ఏజెన్సీ ద్వారా సెప్టెంబర్, 2023 మాసంలో తీసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగాల పేరిట మణికంఠ ఏజెన్సీ ఇతరుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులకు కలెక్టరేట్‌కు సంబంధం లేదని బద్నాం చేసే ఏజెన్సీల పై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్దతి పై నియమించిన వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకి పంపించడం జరిగిందని, మోసపూరితంగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన మణికంఠ ఏజెన్సీ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు. యువత మోసపోకుండా సంబంధిత శాఖల అధికారులను, ఉపాధి కల్పన కార్యాలయం లో ఉద్యోగ వివరాలు తెలుసుకోవాలని ఎక్కడ కూడా ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మోసపోకుడదని యువతకు సూచించారు.



Next Story

Most Viewed