- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్పెషల్ ఆఫీసర్ పాలనలో..కొండెక్కిన వీధి దీపాలు
by Naveena |

X
దిశ, నాగారం: మండలం వర్ధమానుకోట గ్రామం ఎస్సీ కాలనీలో వీధి దీపాలు మూడు రోజులుగా వెలగడం లేదని స్థానికులు తెలిపారు. గ్రామ స్పెషల్ ఆఫీసర్ తహశీల్దార్ వి.బ్రహ్మయ్య పాలనలో ఎస్సీ కాలనీలో వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు. సీసీ రోడ్లపై అంధకారం అలముకోవడంతో..విష పురుగుల సంచారం అధికంగా ఉంటుందని ప్రజానీకం ఎంతో భయాందోళన చెందుతున్నారు.ఇటు స్పెషల్ ఆఫీసర్ తహశీల్దార్ వి.బ్రహ్మయ్య గాని,అటు గ్రామ పంచాయతీ కార్యదర్శి గాని పట్టించుకోకపోవడంతో..ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వీధి దీపాల సమస్య పరిష్కరించాలని, కాలనీ చీకట్లో నుంచి వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.
Next Story