- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇద్దరు గంజాయి అమ్మే వ్యక్తులు అరెస్ట్..

దిశ, చివ్వేంల: ఇద్దరు గంజాయి అమ్మే వ్యక్తులను పట్టుకున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శనివారం చివ్వేంల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ.. శనివారం ఉదయం సూర్యాపేట - ఖమ్మం రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఖమ్మం రోడ్డు వైపు నుండి ఒక బ్యాగ్ తో అనుమానస్పదంగా వస్తుండగా ఎస్సై వి. మహేశ్వర్, సిబ్బంది వారిని పట్టుకుని విచారించగా ఒరిస్సా స్టేట్ లోని బేజ నుంచి గంజాయి కొనుక్కొని సూర్యాపేట లో అమ్ముటకు తీసుకొని వస్తున్నామని చెప్పినట్లు తెలిపారు. వారి నుంచి 1.250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి విలువ రూ .15,000/- లు తెలిపారు.
నేరస్తులు A1. అమర్ నాథ్ నిషాద్ (25) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (ఇతని పై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అరెస్ట్ కావలసి ఉన్నది).
A2. మహమ్మద్ హబీబ్( 28 )వారి నుంచి 1.250 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై-2 తెలియజేసారు. వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై మహేశ్వర్, స్థానిక సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై మహేశ్వర్, ఎస్సై- 2 రత్నం, ఏఎస్సై సుధాకర్ రెడ్డి, స్థానిక సిబ్బంది, తదితరులు ఉన్నారు.