- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇరువురు మృతి..

దిశ, కోదాడ: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు స్టేజి వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ్ (21) తొగర్రాయి గ్రామానికి చెందిన కలకొండ సుదర్శన్ (28) సుదర్శన్ పని నిమిత్తం కోదాడ వచ్చి తిరిగి తన స్వగ్రామం వైపు వెళ్తున్న క్రమంలో మేళ్లచెరువు నుంచి కోదాడ వైపు వస్తున్న విజయ్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సుదర్శన్ హైదరాబాదులో సుతారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం మన స్వగ్రా మైన తొగర్రాయికి వచ్చాడు. ఈలోపులో తనని మృత్యువు వెంటాడింది. తన తల్లి కూడా మూడు నెలల క్రితం చనిపోయింది. విజయ్ మహా సిమెంట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకదాని ఒక కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోతున్నారు.