Accident : రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి… మరొకరి పరిస్థితి విషమం

by Kalyani |
Accident : రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి… మరొకరి పరిస్థితి విషమం
X

దిశ, కోదాడ : రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని మసీదు సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గునుగుంట్ల రామకృష్ణ (48) పట్టణంలోని చెరువు బజార్ నివాసం ఉంటున్నాడు. తన మనవరాలు కి ఆరోగ్యం బాగాలేక మందులు తీసుకొని రోడ్డు దాటుతున్న క్రమంలో బస్టాండ్ వైపు నుంచి హుజూర్నగర్ రోడ్డు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రామకృష్ణ అక్కడక్కడ మృతి చెందాడు. ద్విచక్ర వాహనం పై ఉన్న నల్లని మురళి, గూడెపు నవీన్ , దాసోజు శ్రీను లకు గాయాలయ్యాయి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed