- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రధాన రహదారిపై మూల మలుపులు..మృత్యువుకు పిలుపులు

దిశ, భూదాన్ పోచంపల్లి; ఈ రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. మూలమలుపులు గమనించక ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లిని సందర్శించేందుకు దేశ,విదేశీయుల నుంచి పట్టణ కేంద్రానికి ప్రజలు వస్తుంటారు. అయితే పోచంపల్లికి కూతవేటు దూరంలో హైదరాబాద్..ఉండడంతో ఉద్యోగ,వ్యాపారాలు చేసేందుకు వందల సంఖ్యలో నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలోని చెరువు కట్టపై ఉన్న మూలమలుపు రోజురోజుకు మృత్యువుగా మారుతుంది. హైదరాబాద్ కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. చెరువు కట్టపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు రాత్రి వేళలో పోచంపల్లికి వస్తుండగా..మూలమలుపు కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గతంలో కూడా పలువురు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందేనని చెప్పొచ్చు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..పట్టించుకునే నాధుడే కరువయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేదా చెరువు కట్టకు ఇరువైపులా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.