తొట్టి గ్యాంగ్ అరెస్ట్.. పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్

by Naresh |
తొట్టి గ్యాంగ్ అరెస్ట్.. పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్
X

దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్ రాజు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను పిట్ల మహేష్, ఆవుల రాకేష్ నెల్లూరు జిల్లా వారిని కోదాడ హైవే మీద అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వాళ్ళు దొంగలు అని వారి వద్ద నుంచి 2 లక్షల 77 వేల రూపాయలు స్వాధీనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల విలువైన వస్తువులను కారు, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. వారు పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేసుకొని అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు గతంలో కూడా కొన్ని దొంగతనాలు ఇలానే చేసినట్లు ఒప్పుకున్నారు అని డీఎస్పీ తెలిపారు. అలాగే ఈ కేసును ఛేదించిన వారిని మిర్యాలగూడలో సీఐ వీరబాబు, ఎస్‌ఐ సతీష్, కానిస్టేబుళ్ల ఏ. ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, సైదులును అభినందించారు.



Next Story

Most Viewed