- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేటి విద్యార్థులు దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి

దిశ, హాలియా: గ్రంథాలయాలు విజ్ఞాన గనుల లాంటివని విజ్ఞానం సమాజ వికాసానికి తోడ్పాటు అందిస్తుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని పగవాని కుంట తండా గ్రామంలో జేడీ ఫౌండేషన్, ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళోజీ గ్రంథాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం శుభం ఫంక్షన్ హాల్ లో జరిగిన విద్యార్థుల మోటివేషన్ క్లాసులో మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకొని పక్కదారి పడుతున్నారని దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా సమాజానికి సార్ధకత ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు, యువతకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
నేటి విద్యార్థులు మీ ఇంటి కోసం మీ ఊరికి కోసం మీ రాష్ట్రం కోసం, మన దేశం కోసం పని చేసే బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెయింట్ మార్టిన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్, మండల విద్యాధికారి బాలు నాయక్ జేడీ ఫౌండేషన్ కన్వీనర్ కవిత, పర్యావరణ వేత్త సురేష్ గుప్తా, ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఫౌండర్ మెగా వత్ కొండా నాయక్, అధ్యక్షులు భరత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, అంజి, సాయి, రమేష్, సురేష్, శ్రీను, కార్తీక్, నవీన్, కుమార్, శ్రీకాంత్, శివ, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.