- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు...

దిశ, హుజూర్ నగర్ : ఈ నెల 27న జరిగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా ఎలక్షన్ అధికారులకు టీచర్లంతా సహకరించాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లోని సెంటర్ లో 185 మంది, గరిడేపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ సెంటర్ 94 మంది, నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 95 మంది, పాలకవీడు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో 22 మంది మఠంపల్లిలోని ఎమ్మార్సీ బిల్డింగ్ మీటింగ్ హాల్ నందు 34 మంది ఓటర్లు ఈ 5 మండలాల్లో 430 మంది తమ ఓటు హక్కును కలిగి ఉన్నారని తెలిపారు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ సెంటర్ నందు 6 గురు పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.